గ్రంథాలయ వారోత్సవాలు: 14 నుంచి 20 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు
ఈనెల 14 నుండి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు కార్యదర్శి వి. అర్జున్ తెలిపారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులు, పాఠకుల కోసం పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
14వ తేదీన చాచా నెహ్రూ జయంతి సందర్భంగా చిన్నారులకు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభోత్సవం జరగనుంది. 15న భావంతో కూడిన పద్యాల పోటీ, 16న వకృత్వపు పోటీ, 17న పుస్తక ప్రదర్శన, 18న వ్యాసరచన, 19న మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 20వ తేదీన ముగింపు కార్యక్రమం, బహుమతి ప్రధానోత్సవం నిర్వహించబడుతుంది.
వివరాల కోసం గ్రంథాలయ పాలకురాలు జి. మణి మృదుల (9346382604, 9642600978)ను సంప్రదించాలని సూచించారు.